Saturday, December 18, 2010

పాక్ పాత పాట...

ఇస్లామాబాద్ ,డిసెంబర్ 18: కాశ్మీర్ సమస్యకు న్యాయమైన పరిష్కారం లభించేంతవరకు భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉంటాయని పాక్ స్పష్టంచేసింది. పాక్‌పై దుష్ర్పచారానికి భారత్ ఉగ్రవాదం అంశాన్ని ఉపయోగించుకుంటోందని పాక్ విదేశాంగ కార్యదర్శి బషీర్  ఆరోపించారు. ఉగ్రవాదం ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాలేదని, అది ప్రపంచవ్యాప్త సమస్య అని వ్యాఖ్యానించారు. ‘ఇరుదేశాల మధ్య కాశ్మీర్ సహా, చాలాకాలంగా నలుగుతున్న సమస్యలు ఉన్నాయి.. వాటికి సరైన పరిష్కారం లభించేంతవరకు ఏదో, ఒక రూపంలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉంటాయి’ అని బషీర్ పేర్కొన్నారు.  కాగా , కాశ్మీర్ సమస్యతో సహా భారత్‌తో పెండింగ్‌లో ఉన్న అన్ని అంశాలనూ శాంతియుతంగా పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నట్లు పాకిస్థాన్ ప్రధాని గిలానీ పేర్కొన్నారు. మూడు రోజులపాటు పాక్‌ పర్యటనకు వచ్చిన చైనా ప్రధాని వెన్ జియాబావోకు విందు ఇచ్చిన సందర్భంగా గిలానీ మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో శాంతికి, అభివృద్ధికి విఘాతం కల్గించే ఎలాంటి విధానాన్నైనా పాక్ వ్యతిరేకిస్తుందని స్పష్టంచేశారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...