Friday, December 17, 2010
నిరాహార దీక్ష ప్రారంభించిన చంద్రబాబు
హైదరాబాద్ ,డిసెంబర్ 17: రైతుల సమస్యలపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు శుక్రవారం ఉదయం న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద నిరాహార దీక్ష ప్రారంభించారు. మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు కొబ్బరికాయ కొట్టి దీక్షను ఆరంభించారు. చంద్రబాబుతోపాటు ఎంపీ హరికృష్ణ, దేవేందర్గౌడ్, నాగం జనార్థన్రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఉమామాధవరెడ్డి, మహిళా ఎమ్మెల్యేలు దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ వరుసగా వస్తున్న కష్టాలు, నష్టాలతో రైతులు ఏవిధంగా బతకాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్నారన్నారు.పంట నష్టపోయిన రైతులకు వరికి ఎకరాకు రూ.10వేలు, వాణిజ్య పంటలకు 15వేలు నష్టపరిహారం చెల్లించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి నష్టం వచ్చినా తడిచిన, మొలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. కౌలు రైతులను కూడా ఆదుకోవాలన్నారు.చేనేత కార్మికుల పరిస్థితి దయనీయంగా ఉందని చంద్రబాబు అన్నారు. వారిని ఆదుకునేందుకు ప్రత్యేక ప్యాకేజీని కోరినట్లు ఆయన తెలిపారు. కావాలనే పత్తి ఎగుమతులపై ఆంక్షలు విధించి ధర తగ్గేలా చేశారన్నారు. అలాగే వ్యవసాయ కూలీలు. మత్స్యకారులు, పశువుల కాపర్లు, చేతి, కులవృత్తుల వారిని సర్కార్ ఆదుకోవాలన్నారు. అంతర్జాతీయ ధరలను బూచిగా చూపి పెట్రోల్, డీజిల్ ధరలను విపరీతంగా పెంచారన్నారు. విధి లేని పరిస్థితిలోనే తాను నిరాహార దీక్షకు దిగినట్లు చంద్రబాబు తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment