Thursday, December 16, 2010

అందరూ మెచ్చే నివేదికే ఇస్తాం: శ్రీకృష్ణ కమిటి

హైదరాబాద్,డిసెంబర్ 16: శ్రీకృష్ణ కమిటి నివేదిక సిద్ధమైనట్లు సభ్య కార్యదర్శి వీకె. దుగ్గల్ వెల్లడించారు. ఈ నివేదికకు తుది మెరుగులు దిద్దుతున్నామని, ఈ నెలాఖరులోగా దానిని ప్రభుత్వానికి అందిస్తామని పునరుద్ఘాటించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు, రాజకీయ పార్టీలు, సంస్థలతో చర్చించి నివేదిక రూపొందించామని చెప్పారు. శ్రీకృష్ణ కమిటి తుదివిడత రాష్ట్ర పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో దుగ్గల్ మాట్లాడారు. తామిచ్చే నివేదిక అందరినీ సంతృప్తి పరుస్తుందనే ఆశిస్తున్నామని, ఇది తమకు సవాల్‌తో కూడుకున్న విషయమని తెలిపారు. తక్కువ వ్యవధిలోనే ఎన్నో విషయాలను ఎంతో ఎకాగ్రతగా పరిశీలించి నివేదిక రూపొందిచామన్నారు. ఈ నివేదిక రూపొందించడంలో సహకరించిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ లాంటి అందమైన రాష్ట్రం మరెక్కడా లేదని కితాబిచ్చారు. ఇక్కడ ఉన్నన్ని పర్యాటక ప్రదేశాలను తాము ఎప్పుడూ, ఎక్కడా చూడలేదన్నారు.తామిచ్చే నివేదికలో ఏమున్నప్పటికీ ప్రజలు సంయమనం పాటించాలని శ్రీకృష్ణ కమిటి సభ్యులు విజ్ఞప్తి చేశారు. అన్ని రాజకీయ పార్టీల నేతలను కలిసి ఇదే విషయం చెప్పామన్నారు. శ్రీకృష్ణ కమిటీ సభ్యులు గురువారం మధ్యాహ్నం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌తో సమావేశమయ్యారు. అంతకుముందు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీలతో వారు చర్చలు జరిపారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...