Thursday, December 16, 2010

శ్రీకృష్ణ నివేదిక అనుకూలంగా లేకుంటే సహాయ నిరాకరణ : కోదండరాం

వరంగల్,డిసెంబర్ 16: డిసెంబర్ 31న తెలంగాణకు అనుకూలంగా శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇవ్వనట్లయితే.. జనవరి 1 నుంచి సహాయ నిరాకరణ చేస్తామని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్, ప్రొఫెసర్ కోదండరాం హెచ్చరించారు. మహాగర్జన సభలో కోదండరాం మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై కేంద్రం ఏమాత్రం తాత్సారం చేసినా సహాయ నిరాకరణ ద్వారా ప్రభుత్వ కార్యకలాపాలను స్తంభింపజేస్తామని, ఈ మేరకు వారం రోజుల్లో ప్రకటన చేస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రాంతంలో ఉన్న వివిధ జిల్లాల్లోని ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులతో మాట్లాడామన్నారు. బ్రిటిష్ . శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఎలా వస్తుందనే అనుమానాలను కొందరు మిత్రులు వ్యక్తం చేస్తున్నారని, ఈ నివేదిక మనకు అనుకూలంగా వచ్చినా.. రాకపోయినా తెలంగాణ సాధన కోసం ముందుండి పోరాడాల్సిందేనని చెప్పారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...