హైదరాబాద్ లో పెరిగిన ఆటో రేట్లు

హైదరాబాద్,డిసెంబర్ 14: నగరంలో ఆటోల  మీటర్ చార్జీలు పెరిగాయి.  ఇప్పుడున్న కనీస మీటర్ చార్జీ రెండు రూపాయలు పెరగగా, కిలోమీటర్‌కు రూపాయి చొప్పున పెరిగింది. రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో ఆటోరిక్షా కార్మిక సంఘాలు మంగళవారం సాయంత్రం రెండు దఫాలుగా జరిపిన చర్చలలో ఈ మేరకు అంగీకార ం క్దిరింది.  కనీస చార్జీ ప్రస్తుతం రూ.12 ఉండగా, దానిని రూ.14కు పెంచారు. అలాగే ప్రతీ కిలోమీటర్‌కు ఇప్పుడు రూ.7 ఉండగా, దానిని రూ.8 కి పెంచడంతో పాటు వెయింటింగ్ ఛార్జీని నిమిషానికి 10 పైసల నుంచి 25 పైసలు పెంచేందుకు ప్రభుత్వం అంగీకరించింది.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు