Thursday, December 30, 2010

నివేదిక సమర్పించిన శ్రీకృష్ణ కమిటీ: జనవరి 6 న వివరాలు

న్యూఢిల్లీ,డిసెంబర్ 30:  : కేంద్ర హోంమంత్రి చిదంబరానికి జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ తమ నివేదికను గురువారం సమర్పించింది. కమిటీ సభ్యుల నుంచి ఆయన నివేదికను అందుకున్నారు. రెండు సంపుటాల రూపంలో ఈ నివేదికను ఇవ్వటం జరిగింది. నార్త్‌బ్లాక్‌లోని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యాలయంలో శ్రీకృష్ణ కమిటీ సభ్యులు చిదంబరంతో సమావేశం అయ్యారు. శ్రీకృష్ణ కమిటీ అందించిన రిపోర్టును జనవరి 6 తేదిన సాయంత్రం ఇంటర్నెట్‌లో పెడుతామని కేంద్ర హోంమంత్రి చిదంబరం మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజల మనోభావాల్ని దెబ్బతినకుండా శ్రీకమిటీ నివేదికను పాఠకులకు, ప్రేక్షకులకు అందించాలని పత్రికలకు, టెలివిజన్ చానెల్లకు చిదంబరం విజ్ఞప్తి చేశారు. ఊహాజనితమైన కథనాలను, అవాస్తవాలను ప్రసారం చేయవద్దని ఆయన మీడియాను కోరారు. శ్రీకృష్ణ కమిటీ అందించిన నివేదికపై ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని గుర్తింపు పొందిన పార్టీలతో చర్చించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం చర్యలను ప్రారంభిస్తుందని హోంమంత్రి అన్నారు. సరియైన నిర్ణయాన్ని తీసుకునే ముందు ప్రజాస్వామ్య పద్దతిలో అన్ని పార్టీలతో సంప్రదింపుల తర్వాతే ఓ నిర్ణయాన్ని వెల్లడిస్తామని ఆయన అన్నారు. కగా, జనవరి 6 తేదిన ఢిల్లీ రావాలంటూ ఆంధ్రప్రదేశ్‌లోని గుర్తింపుపొందిన ఎనిమిది రాజకీయ పార్టీలకు హోంమంత్రి చిద ంబరం ఆహ్వానం పంపారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు చెందిన ఇద్దరు సభ్యులను హాజరుకావాలని ఆహ్వానంలో తెలిపారు. జనవరి 6 తేదిన అన్ని పార్టీల నేతలతో ఉదయం 11 గంటలకు నార్త్ బ్లాక్‌లో భేటి జరుగుతుందని తెలిపారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...