Tuesday, December 21, 2010

రాష్ట్ర రైతులకు 400 కోట్ల కేంద్ర సాయం

న్యూఢిల్లీ,డిసెంబర్ 21: రాష్ట్రం లో రైతు సమస్యల పరిష్కారానికి విపక్షాల ఆందోళనల నేపధ్యం లో రాష్ట్ర రైతులకు ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ 400 కోట్ల రూపాయల ప్యాకేజి ప్రకటించారు. జాతీయ విపత్తు నిధి కింద ఈ నిధులు విడుదల చేస్తారు. పొగాకు, రంగు మారిన ధాన్యం కొనుగోలుకు కూడా కేంద్రం అంగీకరించింది. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై మన రాష్ట్రానికి చెందిన రాజ్యసభ, లోక్‌సభ సభ్యులు మంగళవారం ప్రధానితో సమావేశమై, రైతాంగ సమస్యలపై ఒక వినతి పత్రం సమర్పించారు. అనంతరం జైపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రైతుల సమస్యలను ప్రధానికి వినతి పత్రం రూపంలో విన్నవించినట్టు చెప్పారు. అందులో పేర్కొన్న అంశాలను చూసి ఆయన  తక్షణ సాయంగా అడ్వాన్స్‌ల రూపంలో రూ.400 కోట్లు ఇవ్వనున్నట్టు చెప్పారని జైపాల్ రెడ్డి తెలిపారు. అంతేకాకుండా, పూర్తిగా రంగుమారిన ధాన్యాన్ని కూడా ఎఫ్‌సీఐ కొనుగోలు చేయాలని కోరినట్టు చెప్పారు. ఇదే అంశంపై కేంద్ర వ్యవసాయ శాఖామంత్రి శరద్ పవార్‌ను కూడా కోరనున్నట్టు చెప్పారు. కంది, మినుము తదితర వాణిజ్య పంటల రైతులను ఆదుకోవాలని కేంద్ర వాణిజ్య మంత్రి ఆనంద్ శర్మకు వినతి పత్రం సమర్పించగా, ఆయన సానుకూలంగా స్పందించినట్టు చెప్పారు. అదేవిధంగా చేనేత కార్మికులను ఆదుకోవాల్సిందిగా కేంద్ర జౌళి శాఖామంత్రి దయానిధి మారన్‌కు విజ్ఞప్తి చేశామన్నారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...