Monday, December 20, 2010
నిత్యానంద ఆస్తులు 2వేల కోట్లు...!
బెంగళూరు,డిసెంబర్ 20: శృంగారకేళీలు జరిపి పట్టుబడ్డ నిత్యానంద తాను కొన్ని కోట్లకు అధిపతిని అనే విషయాన్ని సిఐడి పోలీసుల విచారణలో తెలిపాడట. ఆయన వద్ద సుమారు 2వేల కోట్ల రూపాయలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇన్ని డబ్బులు సంపాదించిన నిత్యానంద అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో ఓ దీవి కొనుక్కొని అక్కడే లగ్జరీ జీవితం గడుపుదామనుకున్నాడట. కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన ఆశ్రమాలకు లాస్ ఏంజేల్స్ ను ప్రధాన కేంద్రంగా చేద్దామని భావించాడు. కానీ పాపం ఆయన విదేశాలకు వెళ్లడానికి సిద్ధమయిన తరుణంలో హిమాచల్ ప్రదేశ్ లో అరెస్టయ్యాడు. నిత్యానంద సాధువుగా జీవిస్తున్నప్పటికీ లగ్జరీ లైఫ్ గడపడమే ఆయనకు ఇష్టమంట. విదేశాలకు వెళ్లినప్పుడు జీన్స్ ప్యాంట్ వేసుకొని అందమైన అమ్మాయిలతో డ్యాన్సులు కూడా చేసేవాడంట. అమెరికా వెళ్లగానే నిత్యానంద స్వామి గెటప్ మారుతుందంట. చీకటి పడితే నైట్ పార్టీలకు వెళ్ళే నిత్యానందకు ఇష్టమైన డ్యాన్సు ల్యాప్ డ్యాన్సు. నిత్యానందపై స్మగ్లింగ్ ఆరోపణలు ఉన్నాయి. ఓ భక్తడి నుండి యాగం పేరిట 4లక్షల డాలర్లు వసూలు చేశాడంట గతంలో. నిత్యానంద ప్రముఖుల దగ్గరనుండి భారీగానే డబ్బులు వసూలు చేస్తారు. అయితే అలా వసూలు చేసిన సొమ్ముతో ఏదైనా కొన్నప్పుడు దాతలు ఇచ్చినట్టు ప్రకటిస్తాడట. నిత్యానంద సామ్రాజ్యం ప్రపంచమంతా విస్తరించింది. భారత్ నుండి అమెరికా వరకు ఆయన ఆశ్రమాలు ఉన్నాయి. కర్ణాటకలోని బిడాడిలో మొదట అశ్రమం స్థాపించాడు. ఆ తర్వాత ఒక్కొటి స్థాపించుకుంటూ వెళ్లిపోయాడు. నిత్యానందకు అమెరికాలో నాలుగు ఆశ్రమాలు ఉన్నాయి. లాస్ ఏంజెల్స్ లో 100 ఎకరాల స్థలం ఉందంట. అమెరిరాకా, మలేషియా తదితర 33 దేశాల్లో వెయ్యికి పైగా ఆశ్రమాలు ఉన్నాయి. నిత్యానంద కేవరం రంజితతోనే రాసలీలలు జరపలేదు, తన వద్దకు వచ్చే భక్తురాళ్లలో చాలామందిని లోబర్చుకునే వాడంట. భక్తురాళ్లను లోబర్చుకోవడానికి ఆయన ఓ పద్ధతిని కూడా ప్రవేశపెట్టాడు. అదే ఏకాంత సేవ. ఏకాంత సేవ పేరుతో భక్తురాళ్లని రాత్రిపూట సేవ పేరిట ఆశ్రమంలోనే ఉంచుకొని వారితో నేను కృష్ణుడు అయితే నీవు రాధవు అంటూ పలికి వాళ్లను లోబర్చుకునేవాడంట. చిరుత చర్మం పోలీసులకు నిత్యానంద ఆశ్రమంలో దొరికిందంట. నిత్యానందపై పోలీసులు 430 పేజీల చార్జీ షీటు తయారు చేసినట్టు తెలుస్తోంది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment