Thursday, December 16, 2010

ఇక ‘2జీ’ దర్యాప్తుపై సుప్రిం' పర్యవేక్షణ: ఎన్‌డీఏ పాలన వరకూ దర్యాప్తు పరిధి విస్తరణ

న్యూఢిల్లీ,డిసెంబర్ 16: 2జీ స్పెక్ట్రం కుంభకోణం దర్యాప్తును పర్యవేక్షించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. దర్యాప్తు పరిధిని ఎన్‌డీఏ పాలన వరకూ విస్తరిస్తూ... 2001 నుంచి 2008 వరకు టెలికాం విధానాన్ని దర్యాప్తు పరిధిలోకి చేర్చింది. ‘ఇది రూ. 1.76 లక్షల కోట్లకు సంబంధించినది మాత్రమే కాదు.. దీని పరిధి ఇంకా విస్త్రుతమైనది. 2001లో ఏం జరిగిందనేది కూడా పరిశీలించాల్సి ఉంది. అందుకే సీబీఐ ని ఆ కోణంలో కూడా దర్యాప్తు జరపాలని ఆదేశిస్తున్నాం’ అని జస్టిస్ జీఎస్ సింఘ్వీ, జస్టిస్ ఏకే గంగూలీల ధర్మాసనం గురువారం వ్యాఖ్యానించింది. ‘2001 నుంచి, 2006-2007 వరకు లెసైన్సుల జారీలో చోటుచేసుకున్న అవకతవకలకు సంబంధించి ఇప్పటివరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయనట్లయితే, వెంటనే కేసు నమోదు చేసి, కూలంకషంగా దర్యాప్తు జరపాలని ధర్మాసనం సీబీఐని ఆదేశిఇంచింది.  ఇప్పటివరకు జరిపిన దర్యాప్తు పురోగతిపై   నివేదికను వచ్చే విచారణ తేదీ ఫిబ్రవరి 10, 2011న   సీల్డ్ కవర్లలో తమకందజేయాలని సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ)లను ఆదేశించింది. సుప్రీంకోర్టు పర్యవేక్షణకు ప్రభుత్వం అంగీకరించింది కాబట్టి స్కామ్ విచారణకు మరో ప్రత్యేక బృందం అవసరం లేదని ధర్మాసనం స్పష్టంచేసింది. కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) నివేదిక ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తూ.. అర్హత లేని కంపెనీలు స్పెక్ట్రం లెసైన్సులు పొందినట్లు స్పష్టమైన ఆధారాలున్న కాగ్ నివేదికను కూడా పరిగణనలోకి తీసుకొని దర్యాప్తు జరపాలని సీబీఐని ఆదేశిస్తున్నట్లు కోర్టు తెలిపింది. 122 లెసైన్సుల జారీలో అవకతవకలు జరిగినట్లు ప్రాథమిక ఆధారాలున్నాయని స్పష్టంచేసింది. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...