భారత్ రెండవ ఇన్నింగ్స్ 228- ఆలౌట్
దర్బన్,డిసెంబర్ 28: భారత్ -దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న రెండవ క్రికెట్ టెస్ట్ రెండవ ఇన్నింగ్స్'లో భారత్ 70.5 ఓవర్లకు 228 పరులు చేసి ఆలౌట్ అయింది. సెహ్వాగ్ 32 పరుగులు, విజయ్ 9, ద్రావిడ్ రెండు, టెండూల్కర్ ఆరు, వివిఎస్ లక్ష్మణ్ 96, పూజారా పది, ధోనీ 21, హర్భజన్ నాలుగు, జహీర్ ఖాన్ 27 పరుగులు చేశారు. మోర్కెల్, సోసోబ్'లు మూడేసి వికెట్లు, స్టేయన్ రెండు వికెట్లు, కల్లీస్, హార్రిస్'లు ఒక్కో వికెట్ తీసుకున్నారు.ఆ తరువాత రెండవ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన దక్షిణాఫ్రికా 27 ఓవర్లకు మూడు వికెట్లు నష్టపోయి 111 పరుగులు చేసింది. శ్రీశాంత ఒక రెండు వికెట్లు తీసుకోగా, హర్బజన్ సింగ్ ఒక వికెట్ తీసుకున్నారు.
Comments