రోడ్డు ప్రమాదాలలో 14 మంది మృతి

హైదరాబాద్,డిసెంబర్ 15:  రాష్ట్రంలో బుధవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాలలో  14 మంది మరణించారు.  ఖమ్మం జిల్లా అశ్వాపురంవద్ద లారీ-ఆటో ఢీకొన్న దుర్ఘటనలో 8 మంది మృతి చెందారు.  కర్నూలు జిల్లాలోని ఆలూరు మండలం కరువల్లి సమీపంలో బస్సు-ఆటో ఢీకొనడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. విజయవాడ పటమట జేడీ టవర్స్ వద్ద లారీ- ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. హైదరాబాద్ అల్కాపురి కూడలి వద్ద లారీ కిందపడి నాలుగో తరగతి విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు