Wednesday, December 15, 2010

రోడ్డు ప్రమాదాలలో 14 మంది మృతి

హైదరాబాద్,డిసెంబర్ 15:  రాష్ట్రంలో బుధవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాలలో  14 మంది మరణించారు.  ఖమ్మం జిల్లా అశ్వాపురంవద్ద లారీ-ఆటో ఢీకొన్న దుర్ఘటనలో 8 మంది మృతి చెందారు.  కర్నూలు జిల్లాలోని ఆలూరు మండలం కరువల్లి సమీపంలో బస్సు-ఆటో ఢీకొనడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. విజయవాడ పటమట జేడీ టవర్స్ వద్ద లారీ- ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. హైదరాబాద్ అల్కాపురి కూడలి వద్ద లారీ కిందపడి నాలుగో తరగతి విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...