Tuesday, December 14, 2010

రైతు సమస్యలపై వేడెక్కిన రాష్ట్ర రాజకీయం...

హైదరాబాద్,డిసెంబర్ 14:  రైతు సమస్యలపై రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి.రైతు సమస్యల పరిస్కారం కోరుతూ, 17 నుంచి నిరవధిక నిరాహార దీక్ష చే స్తామని టీడీపీ అధినేత చంద్రబాబు, 21, 22 తేదీలలో  విజయవాడలో లక్ష మందితో దీక్షకు దిగుతానని మాజీ పార్లమెంటు సభ్యుడు జగన్మోహన్ రెడ్డి ఎచ్చరించీ విషయం తెలిసిందే. ఈ దశలో      ముఖ్యమమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి అండగా నిలబడేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం 1000కోట్ల రూపాయల ప్యాకేజీని కోరగా,  కేంద్రం రూ.500 కోట్లు ప్యాకేజీని ప్రకటించింది. రంగు వెలిసిన, తడిసిన ధాన్యం కొనేందుకు భారత ఆహార సంస్థ(ఎఫ్సీఐ) కొంత  మేర నిబంధనలను  సడలించే అవకాశం ఉంది. అంతేకాకుండా భారత ప్రత్తి సమాఖ్య(సిసిఐ) కూడా పత్తి కొనుగోలుపై ఉదారంగా వ్యవహరించనుంది. రైతులకు ఆర్థికంగా వెసులుబాటు కల్పించి కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం కలిగించాలని ప్రయత్నాలు చేస్తోంది. కేంద్రమంత్రి ప్రణబ్ ముఖర్జీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి పోన్ చేసి రాష్ట్ర పరిస్థితులపై ఆరా తీసినట్టు సమాచారం..

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...