Monday, November 29, 2010

ప్రస్తుతానికి క్యాబినెట్ లో చేరకూడదని పి.ఆర్.పి.నిర్ణయం

హైదరాబాద్,నవంబర్ 29: మంత్రి వర్గంలో చేరకూడదని ప్రజారాజ్యం పార్టీ నిర్ణయించింది. సోమవారం సాయంత్రం పొద్దు పోయేవరకు  జరిగిన పార్టీ కోర్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉండాలని నిర్ణయించారు. వేచి చూసే ధోరణి అవలంభించాలని తీర్మానించారు.  తమ వల్లే వైఎస్ జగన్మోహన రెడ్డి కాంగ్రెస్ పార్టీ వీడారన్న అపవాదు తమపై పడకూడదన్న అభిప్రాయం  సమావేశంలో వ్యక్తమైంది. అయితే ప్రజలపై అనవసర ఎన్నికల భారం మాత్రం పడనీయకూడదని సమావేశం నిర్ణయించింది. భవిష్యత్'లో అవసరమైతే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోర్ కమిటీలో నిర్ణయించారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...