ప్రస్తుతానికి క్యాబినెట్ లో చేరకూడదని పి.ఆర్.పి.నిర్ణయం

హైదరాబాద్,నవంబర్ 29: మంత్రి వర్గంలో చేరకూడదని ప్రజారాజ్యం పార్టీ నిర్ణయించింది. సోమవారం సాయంత్రం పొద్దు పోయేవరకు  జరిగిన పార్టీ కోర్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉండాలని నిర్ణయించారు. వేచి చూసే ధోరణి అవలంభించాలని తీర్మానించారు.  తమ వల్లే వైఎస్ జగన్మోహన రెడ్డి కాంగ్రెస్ పార్టీ వీడారన్న అపవాదు తమపై పడకూడదన్న అభిప్రాయం  సమావేశంలో వ్యక్తమైంది. అయితే ప్రజలపై అనవసర ఎన్నికల భారం మాత్రం పడనీయకూడదని సమావేశం నిర్ణయించింది. భవిష్యత్'లో అవసరమైతే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోర్ కమిటీలో నిర్ణయించారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు