Saturday, November 20, 2010

ఎస్సై పరీక్షలపై సీమాంధ్ర విద్యార్థుల డెడ్ లైన్

హైదరాబాద్,నవంబర్ 20: ఎస్సై పరీక్షలను యథతథంగా నిర్వహించాలని పట్టుబడుతున్న సీమాంధ్ర విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించారు. పరీక్షల వాయిదాను రద్దు చేసుకుని, పరీక్షలను నిర్వహిస్తామని సోమవారంలోగా ప్రభుత్వం ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్రం అగ్ని గుండమవుతుందని వారు హెచ్చరించారు. తమ ఆందోళనకు మద్దతు తెలపాలని వారు సీమాంధ్ర మంత్రులకు, శాసనసభ్యులకు విజ్ఞప్తులు చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఓ పది మంది విద్యార్థులకు ప్రభుత్వం లొంగిపోయిందని సీమాంధ్ర జెఎసి కన్వీనర్ శామ్యూల్ అన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఓ పది మంది విద్యార్థులు 12 బస్సులు ధ్వంసం చేస్తే శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందనే సాకు చూపారని ఆయన అన్నారు. సీమాంధ్ర విద్యార్థుల సహనాన్ని అసమర్థతగా భావించవద్దని ఆయన అన్నారు. హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నాగార్జున విశ్వవిద్యాలయంలో లా పరీక్షలను ఆందోళనకారులు అడ్డుకున్నారు. విశ్వవిద్యాలయం గేట్లు మూసేశారు కాగా, ఎస్సై పోస్టుల భర్తీకి సాధ్యమైనంత త్వరలో పరీక్షలు నిర్వహిస్తామని రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. ఆందోళనలు విరమించుకోవాలని ఆమె సీమాంధ్ర విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. ప్రశాంత వాతావరణం ఉంటే తప్ప పరీక్షలు నిర్వహించాడనికి వీలు కాదని, దాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు ఆందోళన విరమించాలని ఆమె అన్నారు. ఎస్సై పరీక్షల నిర్వహణ వల్ల ఆరో జోన్ లోని అభ్యర్థులకు ఏ విధమైన అన్యాయం జరగదని నచ్చజెప్పడానికి ప్రయత్నించామని, అయినా తెలంగాణ విద్యార్థులు ఆందోళన విరమించుకోలేదని ఆమె చెప్పారు. ఎవరికీ అన్యాయం జరగకుండా చూస్తామని ఆమె సీమాంధ్ర విద్యార్థులకు హామీ ఇచ్చారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...