యడ్యూరప్ప సేఫ్..

బెంగళూరు,నవంబర్ 24:   కర్ణాటక నాయకత్వంపై వారం రోజుల పాటు సాగిన దాగుడు మూతల అనంతరం ముఖ్యమంత్రిగా యడ్యూరప్పే కొనసాగుతారని బీజేపీ అధిష్టానం  విస్పష్టంగా ప్రకటించింది. ఢిల్లీలో పార్టీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ ప్రకటనను పార్టీ అధికార ప్రతినిధి జవదేకర్ విలేకరుల సమావేశంలో చదివి వినిపించారు. ‘వచ్చే నెలలో తాలూకా, జిల్లా పంచాయతీ ఎన్నికలు జరుగనున్నందున పదవిలో కొనసాగేందుకు యడ్యూరప్పను అధిష్టానం అనుమతించింది’ అని పేర్కొన్నారు. ఢిల్లీలో గడ్కారీ నివాసంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఈశ్వరప్ప సీఎంపై వచ్చిన భూ అక్రమాల ఆరోపణలను తోసిపుచ్చారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు