నో రాజీనామా..కొండా సురేఖ

హైదరాబాద్,నవంబర్ 30 : దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చిన టిక్కెట్టుతోనే తను 2009 ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించాననీ, అది వైఎస్ భిక్ష తప్ప మరెవరి భిక్ష కాదనీ, కనుక తను రాజీనామా చేయనవసరం లేదని మాజీమంత్రి కొండా సురేఖ అన్నారు. రాజకీయాలనైనా వదులుకుంటాం కానీ మంత్రిపదవులకోసం కొంతమంది ఢిల్లీ చుట్టూ తిరిగినట్లు తాము తిరగబోమని వైఎస్ వివేకానంద రెడ్డిపై పరోక్షంగా విమర్శనాస్త్రాలు సంధించారు. వచ్చే 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూస్తుందనీ, పార్టీకి కనీసం 26 స్థానాలు కూడా రావని ఆమె జోస్యం చెప్పారు. 

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు