Sunday, November 28, 2010
కైగా అణు విద్యుత్కేంద్రం కార్యకలాపాలు ప్రారంభం
న్యూఢిల్లీ,నవంబర్ 27: 220 మెగావాట్ల సామర్థ్యంతో పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేసిన భారత 20వ అణు విద్యుత్ ప్లాంటు ... కర్ణాటకలోని కైగా అణు విద్యుత్కేంద్రం కార్యకలాపాలు ప్రారంభించింది. ఫలితంగా 20, అంతకు మించి అణు విద్యుత్ ప్లాంట్లున్న ఆరో దేశంగా భారత్ అవతరించింది. దీంతో దేశ అణు విద్యుత్ సామర్థ్యం 4,780 మెగావాట్లకు చేరింది. ప్లాంటు క్రిటికాలిటీని సంతరించుకుందని ఆటమిక్ ఎనర్జీ కమిషన్ చైర్మన్ శ్రీకుమార్ బెనర్జీ ప్రకటించారు. ప్లాంటును వీలైనంత త్వరగా గ్రిడ్కు అనుసంధానం చేస్తామని చెప్పారు. ప్లాంటును ఆటమిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్ పలు దశల్లో తనిఖీలు చేసిన అనంతరం వాణిజ్యపరంగా విద్యుదుత్పత్తిని మొదలు పెడుతుంది. క్రిటికాలిటీ నుంచి వాణిజ్య ఉత్పత్తి స్థాయికి చేరేందుకు సుమారు రెండు నెలలు పడుతుంది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment