కైగా అణు విద్యుత్కేంద్రం కార్యకలాపాలు ప్రారంభం
న్యూఢిల్లీ,నవంబర్ 27: 220 మెగావాట్ల సామర్థ్యంతో పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేసిన భారత 20వ అణు విద్యుత్ ప్లాంటు ... కర్ణాటకలోని కైగా అణు విద్యుత్కేంద్రం కార్యకలాపాలు ప్రారంభించింది. ఫలితంగా 20, అంతకు మించి అణు విద్యుత్ ప్లాంట్లున్న ఆరో దేశంగా భారత్ అవతరించింది. దీంతో దేశ అణు విద్యుత్ సామర్థ్యం 4,780 మెగావాట్లకు చేరింది. ప్లాంటు క్రిటికాలిటీని సంతరించుకుందని ఆటమిక్ ఎనర్జీ కమిషన్ చైర్మన్ శ్రీకుమార్ బెనర్జీ ప్రకటించారు. ప్లాంటును వీలైనంత త్వరగా గ్రిడ్కు అనుసంధానం చేస్తామని చెప్పారు. ప్లాంటును ఆటమిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్ పలు దశల్లో తనిఖీలు చేసిన అనంతరం వాణిజ్యపరంగా విద్యుదుత్పత్తిని మొదలు పెడుతుంది. క్రిటికాలిటీ నుంచి వాణిజ్య ఉత్పత్తి స్థాయికి చేరేందుకు సుమారు రెండు నెలలు పడుతుంది.
Comments