Friday, November 19, 2010
రంజీ లో త్రిపురపై హైదరాబాద్ గెలుపు
హైదరాబాద్,నవంబర్ 19: రంజీ ట్రోఫీ మ్యాచ్లో హైదరాబాద్ విజయం సాధించింది. జింఖానా మైదానంలో మూడు రోజులకే ముగిసిన మ్యాచ్లో హైదరాబాద్ ఇన్నింగ్స్ 35 పరుగుల తేడాతో త్రిపురను ఓడించింది. గత మ్యాచ్లో విజయానికి చేరువగా వచ్చి డ్రాతో సరిపెట్టుకున్న జట్టు ఈ సారి గెలుపును అందుకుంది.తొలి ఇన్నింగ్స్లో 172 పరుగులు వెనుకబడిన త్రిపుర, రెండో ఇన్నింగ్స్లో రవితేజ (5/20) బౌలింగ్ ధాటికి 137 పరుగులకే కుప్పకూలింది. ఈ విజయంతో హైదరాబాద్కు బోనస్ పాయింట్ సహా 6 పాయింట్లు దక్కాయి. ఈ రంజీ సీజన్లో రాజస్థాన్తో జరిగిన తొలి మ్యాచ్లో అవమానకర ఆటతీరుతో 21 పరుగులకు ఆలౌటై ఓటమిపాలైన హైదరాబాద్, జార్ఖండ్తో జరిగిన రెండో మ్యాచ్ను డ్రాగా ముగించింది. డిసెంబర్ ఒకటి నుంచి జరిగే తర్వాతి మ్యాచ్లో హైదరాబాద్, గోవాను ఢీకొంటుంది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment