త్వరలో జగన్ కొత్త పార్టీ

హైదరాబాద్,నవంబర్ 28: కాంగ్రెసు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన వైయస్ జగన్ వారం,పది రోజులలో  కొత్త పార్టీ ప్రకటించే అవకాశం ఉంది. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి, లోకసభ స్పీకర్ మీరా కుమార్ కు పంపిన జగన్ సోమవారం రాత్రి వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ రైల్లో ఇడుపులపాయకు బయలుదేరి వెళ్లారు. ఇడుపులపాయలో తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత ఆయన బహిరంగంగా మాట్లాడే అవకాశం ఉంది. గురువారంనాడు ఇడుపులపాయకు రావాల్సిందిగా ఆయన తన అభిమానులకు సూచిస్తున్నారు. దాన్ని బట్టి గురువారంనాడు కొత్త పార్టీ గురించి ప్రకటిస్తారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, త్వరలోనే వైయస్ జగన్ పార్టీ పెడతారని వైయస్ జగన్ వర్గానికి చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి చెప్పారు. ఎమ్మెల్సీ రెహ్మాన్ కూడా ఈ విషయం చెప్పారు. కొండా సురేఖ వంటివారు మాత్రం పార్టీ గురించి వైయస్ జగన్ తమతో మాట్లాడలేదని అన్నారు.   కాగా, జగన్ చేసిన రాజీనామాను లోకసభ స్పీకర్ మీరా కుమార్ ఆమోదించారు. 

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు