Wednesday, November 24, 2010

వైఎస్ పథకాలకే తొలి ప్రాధాన్యత: కిరణ్‌కుమార్‌రెడ్డి

 హైదరాబాద్,నవంబర్ 24:  వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ ను అమలు పరచడమే తొలి ప్రాధాన్యత అని నూతన ముఖ్యమంత్రిగా ఎంపికైన  కిరణ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. పతి పనిలోను కష్టం ఉంటుందని, దానిని అధిగమించేందుకే ప్రయత్నిస్తానన్నారు. సమస్యలున్నప్పడే కష్టించి పనిచేయడానికి అవకాశముంటుందన్నారు. రాయలసీమలోని ఓ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించినప్పటికి, తాను అసలు సిసలైన హైదరాబాదీనని కిరణ్‌కుమార్‌రెడ్డి ఓ ప్రైవేట్ టెలివిజన్ చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో  చెప్పారు.  తాను జన్మించింది, విద్యాభ్యాసం, తన బాల్యం, జీవితం అంతా హైదరాబాద్‌తోనే ముడిపడివుందని ఆయన అన్నారు. తెలంగాణ విషయంలో హైకమాండ్ స్టాండే తన స్టాండ్ అని ఆయన వెల్లడించారు. ఇలవుండగా, ముఖ్యమంత్రిగా ఎంపికైన నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డిని పలువురు మంత్రులు, ప్రముఖులు కలిసి అభినందనలు తెలిపారు. సీఎంను కలిసిన వారిలో మంత్రులు గల్లా అరుణకుమారి, బలరాజు, సునీతా లక్ష్మారెడ్డి వున్నారు. ముఖ్యమంత్రిగా కిరణకుమార్ రెడ్డి ఎంపికను తెలంగాణా వాదులు స్వాగతించారు. కిరణ కుమార్‌రెడ్డి చిత్తూరు జిల్లాలో నగిరిపల్లిలో జన్మించినప్పటికీ.. అతని విద్యాభ్యాసం ఎక్కువగా తెలంగాణా ప్రాంతంలోనే సాగింది. మంచి వక్తగా, వివాద రహితుడిగా పేరు ఉన్న వ్యక్తిని సీఎంగా ఎంపిక చేయడంతో తెలంగాణా శ్రేణుల్లో కూడా ఆనందం  వ్యక్తమవుతోంది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...