సింగిల్స్ లోనూ సోమ్ దేవ్ కు స్వర్ణం

 గ్వాంగ్‌జౌ,నవంబర్ 23:  ఆసియా క్రీడల్లో భారత్ మరో స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. టెన్నిస్ క్రీడాకారుడు సోమ్‌దేవ్ దేవ్ వర్మన్ అసాధారణ ప్రతిభతో రెండో పసిడి పతకాన్ని సాధించాడు. సింగిల్స్  ఫైనల్లో సోమ్ దేవ్ ఉజ్బెకిస్తాన్ కు చెందిన డెనిస్ ఇస్తోమిన్ ను 6-1, 6-2 స్కోరుతో ఓడించి స్వర్ణ పతకం సాధించాడు. డబుల్స్ ఈవెంట్  లో సోమ్ దేవ్ స్వర్ణ పతకం సాధించిన విషయం తెలిసిందే. భారత్ ఇప్పటి వరకు టెన్నిస్ లో మూడు కాంస్య పతకాలు సాధించింది. ఇక హకీ సెమీఫైనల్స్ లో భారత్ ఓడిపోయింది. 4-3 తేడాతో భారత్ పై మలేషియా విజయం సాధించింది. కాంస్య పతకం కోసం భారత  జట్టు దక్షిణకొరియా జట్టుతో తలపడనుంది.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు