Monday, November 22, 2010

దలైలామాకు జామియా మిలియా గౌరవ డాక్టరేట్

న్యూఢిల్లీ,నవంబర్ 22:  టిబెట్ అధ్యాత్మిక గురువు దలైలామాను ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ (హానరీస్ కాసా)తో  సత్కరించనుంది. మంగళవారం జరిగే విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో దలైలామాను గౌరవ డాక్టరేట్  తో సత్కరించనున్నట్టు విశ్వవిద్యాలయ అధికారులు తెలిపారు. ఈ స్నాతకోత్సవ కార్యక్రమానికి కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి కపిల్‌సిబాల్ అధ్యక్షత వహిస్తారు.  విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ నజీబ్ జంగ్ అధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో 147 మందికి బంగారు పతకాలు, 127 మందికి పిహెచ్‌డీ డిగ్రిలను ప్రదానం చేస్తారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...