Monday, November 22, 2010

రోశయ్య రాజినామా అస్త్రం?

హైదరాబాద్,నవంబర్ 22: ముఖ్యమంత్రి రోశయ్య మంగళవారం ఢిల్లీ వెడుతున్నారు.  ఐతే  ఆయన  అధిష్టానం పిలుపు మేరకు కాకుండా తనకు తాను గా వెడుతున్నందున రాజకీయ వర్గాలలో పలు ఊహాగానాలు సాగుతున్నాయి. జగన్ వ్యవహారం తలనొప్పి గా మారడం,  మంత్రివర్గ విస్తరణకు, నామినేటెడ్ పోస్టుల భర్తీకి అధిష్టానం తనకు స్వేచ్ఛ ఇవ్వకపోవడంపై ఆయన తీవ్ర మనస్తాపానికి గురైనట్లు చెబుతున్నారు. తాను రాజీనామా చేస్తే శాంతిస్తారా అని రోశయ్య సోమవారం పుట్టపర్తిలో అనడం అందులో భాగమేనని అంటున్నారు. మంత్రివర్గ విస్తరణకు అవకాశం ఇవ్వాలని  నాలుగైదు సార్లు ఆయన  అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. అయితే అధిష్టానం ఇంతవరకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. తనకు స్వేచ్ఛ ఇవ్వకుండా వైయస్ జగన్ వ్యవహారాలను కట్టడి చేయడం సాధ్యం కాదనే ఉద్దేశంతో రోశయ్య ఉన్నట్లు చెబుతున్నారు. వైయస్ జగన్ వ్యవహారం పతాక స్థాయికి చేరుకున్న నేపథ్యంలో రోశయ్య ఢిల్లీ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. పి.సి.సి. నివేదిక ఇప్పటికే అందుకున్న అధిష్టానం  జగన్ పై చర్యలు తీసుకునే విషయంపై రోశయ్యతో అధిష్టానం చర్చించే అవకాశం ఉంది. ఈసారి కూడా ఢిల్లీ పెద్దలు నాన్ పుడు ధోరణి అవలంబిస్తే  రోశయ్య రాజినామా అస్త్రం సంధించ వచ్చని ప్రచారం జరుగుతోంది. కాగా,  కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వ్యవహారంపై ముఖ్యమంత్రి కె. రోశయ్య, పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ పంపిన నివేదికలు అందాయని, ఇది చాలా తీవ్రంగా పరిగణించాల్సిన విషయమని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ  ఢిల్లీలో అన్నారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...