మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ
న్యూఢిల్లీ,నవంబర్ 26: మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర హొం మంత్రి చిదంబరం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉన్న ఒక్కో జిల్లాకు ఈ ఏడాది 25 కోట్ల రూపాయలు కేటాయిస్తారు. వచ్చే ఏడాది ఒక్కో జిల్లాకు 30 కోట్ల రూపాయలు కేటాయిస్తారు. దేశవ్యాప్తంగా 60 జిల్లాలలో ఈ ప్రత్యేక ప్యాకేజీ పథకం అమలు చేస్తారు. ఈ పథకం అమలయ్యే జిల్లాలలో రహదారులు, ప్రజాపంపిణీ వ్యవస్థ, పాఠశాలల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తారు.
Comments