Sunday, November 28, 2010

భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ యత్నాలు ముమ్మరం

న్యూఢిల్లీ,నవంబర్ 27: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలపడం.. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం పొందేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలకు మరింత ఊపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్, జపాన్, రష్యా, జర్మనీ వంటి అనేక దేశాలతో భారత్‌ చర్చలను ముమ్మరం చేసింది. భారతదేశం ఆయా దేశాలతో జరిపే చర్చల్లో భద్రతా మండలితోసహా ఐక్యరాజ్యసమితిని సంపూర్ణంగా సంస్కరించడంపై.. దృష్టి పెట్టింది. భారత్‌కు వచ్చే జనవరి నుంచి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యత్వం లభించనున్న విషయం తెలిసిందే. రెండేళ్లపాటు ఈ హోదాలో భారత్ కొనసాగుతుంది. భారత్‌తోపాటు జి-4 దేశాల గ్రూప్‌లోని బ్రెజిల్, జర్మనీలు సైతం వచ్చే జనవరి నుంచి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశాల హోదాలో కలిసి పనిచేయనుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. భద్రతా మండలిని విస్తరించి.. కొత్తగా ఆరుదేశాలకు శాశ్వత సభ్యత్వం కల్పించాలని జి-4 దేశాలు (భారత్, బ్రెజిల్, జర్మనీ, జపాన్) కోరుతున్నాయి. ఆసియా, ఆఫ్రికా ఖండాల నుంచి రెండేసి, యూరప్, లాటిన్ అమెరికాలకు ఒక్కొక్కటి చొప్పున చోటు కల్పించాలని అవి సూచిస్తున్నాయి. భద్రతా మండలిలోని తాత్కాలిక సభ్యదేశాల సంఖ్యను 15 నుంచి 25కు పెంచాలని కూడా అవి కోరుతున్నాయి.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...