సి.ఎం.ఒ. స్పెషల్ చీఫ్ సెక్రటరీగా జె.సత్యనారాయణ
హైదరాబాద్,నవంబర్ 30 : ముఖ్యమంత్రి ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే తన కార్యాలయంలోని అధికారులను మార్చివేశారు. ముఖ్యమంత్రి కార్యాలయ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా జె.సత్యనారాయణ, కార్యదర్శులుగా రావత్, శ్రీధర్ లను నియమించారు. ప్రస్తుతం సిఎం కార్యాలయంలో ఉన్న జవహర్ రెడ్డి కొనసాగుతారు.పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శిగా శ్యామ్ బాబుని, ట్రాన్సపోర్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా దినేష్ కుమార్ , వ్యవసాయ శాఖ ఉత్పత్తుల కమిషనర్ గా సివిఎస్ కె శర్మ లను నియమించారు.
Comments