Sunday, November 28, 2010

తెలంగాణకే ఉప ముఖ్యమంత్రి పదవి: సి.ఎం.

న్యూఢిల్లీ,నవంబర్ 27: ఉప ముఖ్యమంత్రి పదవిని తెలంగాణవారికే ఇస్తామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి స్పష్టంచేశారు. కొత్త మంత్రివర్గం కూర్పు ఆదివారం నాటికి పూర్తయ్యే అవకాశముందని ఆయన తెలి పారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారిగా ఢిల్లీ వచ్చిన కిరణ్‌కుమార్ శనివారం రోజంతా బిజీబిజీగా గడిపారు. లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్‌ను, రాజ్యసభ చైర్మన్, ఉప రాష్టప్రతి హమీద్ అన్సారీని కలిశారు. ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ను, ఎ.కె.ఆంటోనీ, చిదంబరం, గులాంనబీ ఆజాద్, జైపాల్‌రెడ్డి తదితర కేంద్రమంత్రులను కలిసి రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగేందుకు సహకారం ఇవ్వాలని కోరా రు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీని కలిసి తనకు ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు అప్పగించినందుకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రాంతానికి ఉప ముఖ్యమంత్రి పదవి అక్కర్లేదని తెలంగాణ జేఏసీ పేర్కొందని విలేకరులు ప్రస్తావించగా.. కేబినెట్‌లో ఎవరు ఉండాలనే విషయాన్ని తెలంగాణ జేఏసీ నిర్ణయించదని, కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయిస్తుందని ఆయన బదులిచ్చారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...