Monday, November 29, 2010

‘ఆనంద నిలయం-అనంత స్వర్ణమయం’ ప్రాజెక్టుకు హైకోర్టు బ్రేక్...

హైదరాబాద్,నవంబర్ 29: గత టీటీడీ పాలకమండలి అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘ఆనంద నిలయం-హైదరాబాద్,నవంబర్ 29: గత టీటీడీ పాలకమండలి అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘ఆనంద నిలయం-అనంత స్వర్ణమయం’ ప్రాజెక్టును నిలిపివేయాలని  హైకోర్టు ఆదేశింసింది.  ఈ ప్రాజెక్టు ఆగమ శాస్ర్తాలకు విరుద్ధమని, దీన్ని చేపట్టే పరిధి టీటీడీ పాలకమండలికి లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ ప్రాజెక్టు రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. ప్రాకార వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అధికారం పాలకమండలికి లేదని పేర్కొంది. భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఈ ప్రాజెక్టు విషయంలో టీటీడీ చపలమైన ధోరణితో వ్యవహరించిందని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. టీటీడీ చర్య ఏ మాత్రం లౌకిక కార్యకలాపం కాదని విస్పష్టం చేసింది. ఈ నిర్ణయుం వల్ల, పురాతన కాలం నాటి శాసనాలు దెబ్బ తిని, లిపి కనుమరుగయ్యే ప్రమాదం ఉందని, అందువల్ల స్వర్ణమయం కార్యక్రమాన్ని నిలిపివేయాలని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ప్రకాశరావు, న్యాయమూర్తి జస్టిస్ రెడ్డి కాంతారావులతో కూడిన ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది. టీటీడీ తలపెట్టిన ‘అనంత స్వర్ణమయుం’ కార్యక్రమాన్ని నిలుపుదల చేయాలని కోరుతూ దేవాలయూల పరిరక్షణ సమితి అధ్యక్షుడు జి.రాఘవరెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈయనతో పాటు మరికొందరు కూడా స్వర్ణమయ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ వ్యాజ్యాలు దాఖలు చేశారు.ఇదే సమయంలో స్వర్ణమయాన్ని సమర్థిస్తూ మరికొందరు కూడా అనుబంధ పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లన్నింటిపై వాదనలను విన్న ధర్మాసనం ఈ ఏడాది సెప్టెంబర్ 8న తీర్పును వాయిదా వేసింది. సోమవారం ఎట్టకేలకు తీర్పు వెలువరిస్తూ.. స్వర్ణమయ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ దాఖలైన వ్యాజ్యాలను అనుమతిం చింది. ఆదికేశవులు నాయుడు చైర్మన్‌గా ఉన్న సమయంలో అప్పటి పాలక మండలి అనంత స్వర్ణమయానికి సంబంధించి తీసుకున్న పలు నిర్ణయాలను ధర్మాసనం తీవ్రంగా పరిగణించింది. స్వర్ణమయ కార్యక్రమాన్ని ఓ విధానం అంటూ లేకుండా చేపట్టిన ప్రాజెక్టుగా అభివర్ణించింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...