జిల్లాల్లో ఎస్సై రాతపరీక్ష యథాతథం: రోశయ్య
హైదరాబాద్,నవంబర్ 18: ఎస్సై రాతపరీక్ష హైదరాబాద్ మినహా మిగతా జిల్లాల్లో యథాతథంగా జరుగుతుందని ముఖ్యమంత్రి రోశయ్య స్ఫష్టం చేశారు. ఉన్నతాధికారులతో ఈవిషయంపై సీఎం చర్చించారు. ఈ సమావేశంలో హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డితోపాటు డీజీపీ అరవిందరావు, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఛైర్మన్ పూనం మాలకొండయ్య పాల్గొన్నారు. ఏ ప్రాంతానికి అన్యాయం జరగనివ్వమని, రిక్రూట్మెంట్ను అడ్డుకోవద్దని సీఎం కోరారు. ప్రభుత్వం పట్టింపులకు పోవడం లేదని, ఫ్రీజోన్కు సంబంధించి 14(ఎఫ్) రద్దుకు అసెంబ్ల్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపామని, తాజాగా కేంద్ర హోంమంత్రి చిదంబరంతో కూడా చర్చించానని రోశయ్య వివరించారు. ప్రభుత్వ వాదనలో తప్పులుంటే చెప్పాలని, వాటిని సరిచేసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం సూచించారు. పోలీస్ శాఖలో ఖాళీలతో పరిపాలన నడపలేమని, హైదరాబాద్ ఫ్రీజోనేనని సుప్రీంకోర్టు కూడా తీర్పునిచ్చిందని రోశయ్య అన్నారు.
Comments