Monday, November 29, 2010

జగన్ రాజినామా తో మంత్రుల జాబితా కుదింపు?

హైదరాబాద్,నవంబర్ 29: రాష్ట్రం లో నూతన మంత్రివర్గం బుధవారం నాడు ప్రమా ణ స్వీకారం చేస్తుంది. ముందు సుమారు 30 మంది మంత్రులు  ప్రమాణ స్వీకారం చేస్తారని వార్తలు వెలువడినప్పటికీ, జగన్ రాజినామ  నేపథ్యంలో  18 మందిని మాత్రమే తీసుకోవాలని నిర్ణయించినట్లు ఢిల్లీ పార్టీ వర్గాల సమాచారం. ఈ సంఖ్య 12 మందికే పరిమితం చేసినా ఆశ్చర్యం లేదంటున్నాయి మరి కొన్ని వర్గాలు. పీఆర్పీని ఈసారికి చేర్చుకోకపోయినా, ఆ పార్టీ నిర్ణయం మేరకు ఒక్క చిరంజీవికే ఉప ముఖ్యమంత్రి ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా, దామోదర రాజనర్శింహ కూడా డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయనున్నారు. జగన్‌ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయకుండా పార్టీలో ఉంటూ వేచిచూసే వైఖరి అవలంబిం చడం వ్యూహాత్మకమేనని నాయకత్వం భావిస్తోంది.  జగన్‌ పార్టీ పెట్టేవరకూ వారంతా పార్టీలోనే కొనసాగుతారని, ఆలోగా మంత్రిమండలిలో చోటు దొర కని వారు  జగన్  శిబిరంలోకి వెళ్లేందుకే వారంతా ఒక పథకం ప్రకారం వ్యవహరి స్తున్నారని అంచనా వేస్తోంది. ఈ నేప థ్యంలో ఒక్కసారి 30 మందిని మంత్రి వర్గంలోకి తీసుకుంటే ఇబ్బందులు వస్తాయని, అందుచేత ముందు జాగ్రత్తతో ఆ సంఖ్యను 18కే కుదించినట్లు పార్టీ వర్గాల సమాచారం. జగన్‌ పార్టీ పెట్టిన తర్వాత పరిస్థితి బట్టి మలి విడత విస్తరణ  చేపట్టే వీలుంది. తొలివిడత ప్రమాణం చేసే వారిలో... ధర్మాన ప్రసాదరావు (శ్రీకాకుళం),బొత్స సత్యనారాయణ(విజయనగరం), బాలరాజు (విశాఖ),అహ్మదుల్లా (కడప),గల్లా అరుణ( చిత్తూరు)
టిజి వెంకటేష్‌ (కర్నూలు),జేసీ దివాకర్‌రెడ్డి ( అనంతపురం),కన్నా లక్ష్మీనారాయణ (గుంటూరు),మహీధర్‌రెడ్డి (ప్రకాశం)ఆనం రామనారాయణరెడ్డి (నెల్లూరు),పేర్ని నాని ( కృష్ణా),జానారెడ్డి (నల్లగొండ),భట్టి విక్రమార్క (ఖమ్మం),శ్రీధర్‌బాబు (కరీంనగర్‌)దానంనాగేందర్‌ (హైదరాబాద్‌),సారయ్య ( వరంగల్‌),తోట నర్శింహం (తూర్పు),పితాని (పశ్చిమ) ...పేర్లు వినవస్తున్నాయి.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...