Friday, November 26, 2010

మృత్యువుతో పోరాడి ఓడిన తపస్వి

హైదరాబాద్,నవంబర్ 26: ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడి తిరుపతి రుయా ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఇంటర్ విద్యార్థిని తపస్వి(17) శుక్రవారం తుది శ్వాస విడిచింది. ఆమెకు మెరుగైన చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయంది. నెలరోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరకు ఓడింది. తపస్వి చిత్తూరు లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. నాలుగు కిలోమీటర్ల దూరంలోని ఆ కళాశాలకు తపస్వి ప్రతిరోజు ప్రశాంతినగర్‌కు చెందిన మణికంఠ అనే ఆటో డ్రైవర్ ఆటోలో వెళ్లి వ స్తుండేది. ఈ క్రమంలో త నను ప్రేమించాలంటూ మణికంఠ ఆమెను వేధించసాగాడు. రోజురోజుకు వేధింపులు ఎక్కువ కావడంతో తన కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని చెప్పింది. దీంతో తపస్వి కుటుంబ సభ్యులు మణికంఠను వారించారు. దీనితో తపస్విపై మణికంఠ పగ పెంచుకున్నాడు.అక్టోబర్ 26న కాలకృత్యాలకు వెళ్లిన తపస్విపై మణికంఠతో పాటు మరో ఇద్దరు యువకులు కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో తపస్వి శరీరం 70 శాతం వరకు కాలిపోయింది. దీంతో ఆమెను చికిత్స కోసం తిరుపతి రుయా బర్న్స్ వార్డుకు తరలించారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...