Sunday, November 28, 2010
తొలి వన్ డే లో భారత్ గెలుపు
గువాహతి,నవంబర్ 28: న్యూజిలాండ్తో ఆదివారమిక్కడ జరిగిన తొలి వన్డేలో టీమిండియా 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. 277 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ను 236 పరుగులకే కట్టడి చేసి భారత్ విజయాన్ని అందుకుంది. కివీస్ 45.2 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌటయింది. హౌ 9, గుప్తిల్ 30, విలియమ్సన్ 25, స్టైరిస్ 10, ఇలియట్ 5, టఫీ 4, టేలర్ 66, హాప్కిన్స్ 16, మెక్కల్లమ్ 35, మిల్స్ 32 పరుగులు చేసి అవుటయ్యారు. భారత బౌలర్లలో యువరాజ్, శ్రీశాంత్, అశ్విన్ మూడేసి వికెట్లు పడగొట్టారు. నెహ్రాకు ఒక వికెట్ దక్కింది. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 49 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌటయింది. విరాట్ కొహ్లి (105) సెంచరీతో రాణించాడు. యువరాజ్ సింగ్42, గంభీర్ 38 పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో మెక్కే 4, మిల్స్ 3, టఫీ 2 వికెట్లు పడగొట్టారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment