Wednesday, November 24, 2010

ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డి

హైదరాబాద్,నవంబర్ 24: ఆంధ్రప్రదేశ్ 16వ ముఖ్యమంత్రిగా నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డిని ఎంపిక చేస్తూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఎన్ కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాజ్‌భవన్‌లో జరిగే ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఏర్పాటు శరవేగంగా జరుగుతున్నాయి. సీఎల్పీ భేటిలో ఏకవాక్య తీర్మానాన్ని సోనియాగాంధికి నివేదించిన తర్వాత కిరణ్‌కుమార్‌రెడ్డి పేరును సోనియా ఖరారు చేశారు. సోనియా నిర్ణయాన్ని ప్రణబ్ అధికారికంగా ప్రకటించారు. 1986-2004 వరకు వాయల్పాడు నియోజకవర్గం నుంచి కిరణ్‌కుమార్‌రెడ్డి గెలుపొందారు. 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ చీఫ్ విప్‌గా పనిచేసారు. ఆతర్వాత 2009లో జరిగిన ఎన్నికల్లో పీలేరు నియోజక వర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ రెండవసారి అధికారంలోకి వచ్చాక స్పీకర్ పదవిని చేపట్టారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...