‘పరమవీరచక్ర’లో బాలయ్య ద్విపాత్రాభినయం

హైదరాబాద్: దర్శకరత్న డా.దాసరి నారాయణరావు అందిస్తున్న మరో ‘బొబ్బిలిపులి’ లాంటి సంచలన చిత్రం ‘పరమవీరచక్ర’ లో నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్యున్నారు. ఒకరు మిలటరీ మేజర్ అయితే.... వేరొకరు సినీ సూపర్‌స్టార్. ఏ మాత్రం పొంతన లేని ఉత్తర దక్షిణ ధృవాల్లాంటి ఈ రెండు పాత్రలను ‘పరమవీరచక్ర’ చిత్రంలో చేస్తున్నారు బాలకృష్ణ. అమీషా పటేల్, షీలా, నేహా ధూపియా నాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి సి.కళ్యాణ్ నిర్మాత. తన 150వ చిత్రం ‘పరమవీరచక్ర’లో యాక్షన్‌తోపాటు కామెడీకి కూడా పెద్ద పీట వేస్తున్నారు దర్శకరత్న. అలీ, బ్రహ్మానందం, హేమలపై చిత్రీకరించిన హాస్య సన్నివేశాలు ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్విస్తాయంటున్నారు. ఇందులో అలీ రోబో గా కనిపిస్తారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు