Friday, November 19, 2010

మన్మోహన్ కు రాహుల్ బాసట

న్యూఢిల్లీ,నవంబర్ 19: స్పెక్ట్రమ్ కుంభకోణంతో సతమతమవుతున్న దేశ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ రాహుల్ గాంధీ సమర్ధించారు. ఈ విషయంలో ప్రధానికి తాను గట్టి మద్దతు ఇస్తానని రాహుల్ ప్రకటించారు.ప్రధానమంత్రి విభ్రాంతికర పరిస్థితిలో లేరని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంపై విచారణ జరుపుతున్న సుప్రీం కోర్టు, ప్రధానమంత్రిని విభ్రాంతికర పరిస్థితిలోకి నెట్టిందా..? అని విలేఖరులు అడిన ప్రశ్నకు సమాధానంగా.. రాహుల్ పైవిధంగా బదులిచ్చారు.ఏఐసీసీ జనరల్ సెక్రటరీ జనార్థన్ ద్వివేది కూడా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు తన పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ ఎల్లప్పుడూ ప్రధాని వెంటే నిలుస్తుందని ఆయన తేల్చి చెప్పారు. అతని గొప్పతనం గురించి యావత్ ప్రపంచానికి తెలుసని, ఆయన సమర్ధవంతుడని, పార్టీ పూర్తిగా ఆయనతోనే ఉంటుందని ద్వివేది వ్యాఖ్యానించారు.2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంలో సుప్రీం పరిశీలనపై ప్రధాని వివరణ ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో వారు ఈ వ్యాఖ్యలు చేశారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...