కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతా: వైఎస్ వివేకానందరెడ్డి

కడప,నవంబర్ 30: తన సోదరుడు వైఎస్ రాజశేఖరరెడ్డి నడిచిన బాటలో కాంగ్రెస్ పార్టీలోనే  కొనసాగుతానని వైఎస్ వివేకానందరెడ్డి స్పష్టం చేశారు. అదే విషయాన్ని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి చెప్పినట్లు ఆయన చెప్పారు.  వివేకానందరెడ్డి మంగళవారం కడప ‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తన అంతట తానే ఢిల్లీ వెళ్లానని, తనకు మంత్రి పదవిని అధిష్టానం ఆశ చూపిందనటంలో వాస్తవం లేదని అన్నారు. మంత్రి పదవి ఆశించటమే తప్పయితే క్షమించాలన్నారు. తన కుటుంబంలో చీలిక తీసుకు రావాలనే ఆలోచన పార్టీకి, అధిష్టానానికి లేదని వైఎస్ వివేకానందరెడ్డి అన్నారు. అధిష్టానం ఆదేశిస్తే ఉప ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు.

Comments