Wednesday, November 24, 2010

మేము పట్టించుకోం: కె.సి.ఆర్.

హైదరాబాద్,నవంబర్ 24:   ముఖ్యమంత్రి కె.రోశయ్య రాజీనామా కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమస్య అని టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. రోశయ్య చెప్పినట్లు వయోభారంతోనే రాజీనామా చేసి ఉంటాడని భావిస్తున్నట్లు తెలిపారు. రోశయ్య రాజీనామా, తదనంతర పరిణామాలను తాము పట్టించుకోబోమన్నారు. ఏ ప్రాంతానికి చెందినవారికి సీఎం పదవి కట్టబెట్టినా... తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. ప్రపంచంలో ఏ శక్తి తెలంగాణ ఉద్యమాన్ని ఆపలేదన్నారు. డిసెంబర్ 9న వరంగల్‌లో మహాగర్జనను బ్రహ్మాండంగా నిర్వహిస్తామని  ఆయన  తెలిపారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...