|
ఇడుపులపాయలో అభిమానులతో జగన్ |
హైదరాబాద్,నవంబర్ 30: లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన వైయస్ జగన్ తన తండ్రి వై.ఎస్.ఆర్. ప్రాతినిధ్యం వహించిన పులివెందుల శానససభా స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారా? పులివెందుల నుంచి శానససభకు ఎన్నిక కావడం ద్వారా అధికారాన్ని హస్తగతం చేసుకునే రాజకీయాలను నడపాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. వై.ఎస్.ఆర్. మరణానంతరం ఈ సీటుకు ఆయన సతీమణి విజయలక్ష్మి పోటీ లేకుండా ఎన్నికయ్యారు. ఇప్పుడు ఆమె కూడా రాజీనామా చేయడం తో పులివెందుల శాసనసభా సీటుకు మళ్ళి ఉప ఎన్నిక అవసరమైంది. దాంతో జగన్ రాజీనామా చేసిన కడప లోకసభ స్థానానికి, పులివెందుల అసెంబ్లీ సీటుకు ఆరు నెలల్లోగా ఎన్నికలు జరగాల్సి వుంది. తాను శాసనసభకు పోటీ చేసి, బాబాయ్ వైయస్ వివేకానంద చేత లోకసభకు పోటీ చేయించాలన్నది జగన్ ఆలోచన కావచ్చునేమో కానీ, ఇప్పుడు వివేకానంద తాను కాంగ్రెస్ లోనే వుంటానని, అధిష్టానం కోరితే పులివెందుల నుంచి పోటీ చేస్తానని ప్రకటించడంతో బాబాయ్,అబ్బాయి ఇద్దరూ పులివెందులలో తలపడే అవకాశాలు లేకపోలెదు. కాగా,కడపలో వైయస్ జగన్, ఆయన బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి మధ్య జరిగిన సంభాషణ ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. కేవలం రెండే నిమిషాలసేపు వారు మాటా మాటా అనుకొని దాదాపుగా తెగతెంపులు చెసుకున్నట్టు సమాచారం. వైయస్ వివేకానంద రెడ్డి విసురుగా బయటకు వచ్చి మీడియా సమావేశం లోతాను తాను కాంగ్రెసుతోనే ఉంటానని ప్రకటించారు. విశ్వసనీయ సమాచారం వారి సంభాషణ ఇలా జరిగిందిట.
వైయస్ జగన్ : ఇక్కడికి ఎందుకొచ్చావు
వైయస్ వివేకానంద రెడ్డి: జరిగిందేదో జరిగింది, ఇప్పుడు సర్దుకుపోదాం
వైయస్ జగన్: నాయన పేరు చెడగొట్టావ్
వైయస్ వివేకానంద రెడ్డి: నేనేం చేశాను
వైయస్ జగన్: చేసిందంతా చేసి.. ఏం చేశానంటావు
వైయస్ వివేకానంద రెడ్డి: అలా అంటే ఎలా
వైయస్ జగన్: నీ దారి నీది, నా దారి నాది.
వైయస్ వివేకానంద రెడ్డి: నువ్వు చేసింది తప్పు.
వైయస్ జగన్: నేనేం చేశానో నాకు తెలుసు
వైయస్ వివేకానంద రెడ్డి: నేను పోతున్నాను
వైయస్ జగన్: నిన్ను ఎవడు రమ్మన్నాడు
వైయస్ వివేకానంద రెడ్డి: పులివెందుల నుంచి పోటీ చేస్తానని అంటున్నావట కదా
వైయస్ జగన్: నీకెందుకు
వైయస్ వివేకానంద రెడ్డి: అయితే అక్కడే తేల్చుకుందాం.
No comments:
Post a Comment