బీహార్ లో జె.డి.(యు)-బి.జె.పి. కూటమి కే మళ్ళీ పట్టం

పాట్నా,నవంబర్ 24: బీహార్ శాసనసభకు జరిగిన ఎన్నికలలో నితిష్ కుమార్ నాయకత్వంలోని జె.డి.(యు)-బి.జె.పి. కూటమి నాలుగింట మూడొంతుల మెజారిటీ సాధించింది.   మొత్తం 243 స్థానాలకు ఎన్నికలు జరుగగా జేడీయూ, బీజేపీ కూటమి 206 సీట్లను గెలుచుకుంది. 2005 ఎన్నికలలో ఈ కూటమికి 143 సీట్లు వచ్చాయి. లాలూ ప్రసాద్ -రాంవిలాస్ పాశ్వాన్ నాయకత్వంలోని ఆర్.జె.డి.-ఎల్.జె.పి. కూటమి కి  25 సీట్లు మాత్రమే వచ్చాయి. ఐతే వీరిద్దరూ ఎన్నికలలో పోటీ చేయలేదు. వీరికి గత ఎన్నికలలో 64 సీట్లు వచ్చాయి. గత అసెంబ్లీలో 5 సీట్లను గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి జరిగిన ఎన్నికల్లో 4 స్థానాలకే పరిమితమైంది.ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ భార్య, మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి  తాము పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు.
ఫలితాలు
జేడీయూ+బీజేపీ =206
ఆర్జేడీ+ ఎల్జేపీ =  25
కాంగ్రెస్        =   4
లెఫ్ట్ + ఇతరులు=  8

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు