ముఖ్యమంత్రి పదవికి రోశయ్య గుడ్ బై...సోనియా కు కొత్త సి.ఎం.ఎంపిక బాధ్యత

హైదరాబాద్,నవంబర్ 24: రాష్ర్ట రాజకీయాలలో అనూహ్య మార్పులు చోటు చెసుకున్నాయి. మంగళవారం వరసగా జరిగిన పరిణామాలలో ముఖ్యమంత్రి పదవికి రోశయ్య రాజీనామ చేయడం, సాయంత్రం జరిగి సి.ఎల్.పి. సమావేశంలో కొత్త ముఖ్యమంత్రి ఎంపిక భాధ్యతను సోనియా కు అప్పగిస్తూ తీర్మానం చెయడం జరిగింది. రోశయ్య బుధవారం మధ్యాహ్నం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను కలసి తన మంత్రిమండలి  రాజీనామా పత్రాన్ని సమర్పించారు. కొత్త ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టేవరకు పదవిలో కొనసాగాలని ఆయనకు గవర్నర్ సూచించారు. అంతకుముందు, విలెకరుల సమవేశంలో రోశయ్య తన రాజినామా నిర్ణయాన్ని ప్రకటించారు. ఎమ్మెల్యేల బలం ఉండి తాను ముఖ్యమంత్రిని కాలేదని, వైఎస్ రాజశేఖర రెడ్డి హఠాన్మరణంతో ఈ పదవి తనకు లభించిందన్నారు. సమస్యల పరిష్కారానికి ఎంతో కృషి చేశానని చెప్పారు. ఇప్పటి వరకు తనకు సహకరించినవారికి ఆయన కృతజ్జతలు తెలిపారు. వయోభారం, పనివత్తిడితోనే రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.ను ముఖ్యమంత్రిగా తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించానని చెప్పారు.

గవర్నర్ నరసిం హన్ కు రాజీనామా సమర్పిస్తున్న రోశయ్య


తనకు ఇంతటి స్థానం కల్పించిన పార్టీని తాను వదలనని, ఓపిక ఉన్నంతవరకు పార్టీకి సేవ చేస్తానని ఆయన చెప్పారు. కాగా, ముఖ్యమంత్రి పదవికి రోశయ్య రాజీనామా చేయడం ఆయన వ్యక్తిగత నిర్ణయమని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి వీరప్ప మొయిలీ అన్నారు. రాష్ర్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం స్థిరంగా ఉందని ఆయన తెలిపారు. మంగళవారం సోనియాను కలిసిన రోశయ్య ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాలనుకుంటున్నట్టు చెప్పారని, అధినేత ఆమోదంతో నే తన పదవికి రాజీనామా చేశారని మొయిలీ తెలిపారు.

సోనియాకే బాధ్యత:

ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక బాధ్యతను పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి ఇస్తూ సాయంత్రం జరిగిన సీఎల్పీ సమావేశం తీర్మానం ఆమోదించింది. ఈ తీర్మానాన్ని రోశయ్య ప్రతిపాదించగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆమోదం తెలిపారు. అధిష్టానం ప్రతినిధులుగా ప్రణబ్ ముఖర్జీ, వీరప్ప మొయిలీ, గులాంనబీ ఆజాద్, ఆంటోనీ, అహ్మద్ పటేల్ ఈ సమావెశానికి ఆజరయ్యారు. సీఎల్పీ అత్యవసర సమావేశానికి 148 మంది ఎమ్మెల్యేలు, 40 మంది ఎమ్మెల్సీలు హాజరయ్యారు. 8 మంది ఎమ్మెల్యేలు, 12 ఎమ్మెల్సీలు గైర్హాజరయ్యారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి, పులివెందుల ఎమ్మెల్యే విజయలక్ష్మి సమావేశానికి హాజరుకపోవడం గమనార్హం. సమావేశం  అనంతరం ప్రణబ్ ముఖర్జీ మీడియాతో మాట్లాడుతూ..సీఎల్పీ సమావేశంలో ఆమోదించిన తీర్మానాలను  పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి నివేదిస్తామనితెలిపారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక బాధ్యతను సోనియాకు అప్పగిస్తూ ఒక తీర్మానం, ముఖ్యమంత్రిగా రోశయ్య సేవలకు ధన్యవాదాలు తెలుపుతూ మరో తీర్మానాన్ని ఆమోదించినట్టు తెలిపారు.  ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై తగిన సమయంలో సోనియా నిర్ణయం తీసుకుంటారని ప్రణబ్ చెప్పారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు