కొత్త స్పీకర్ పై ఉత్కంఠ
హైదరాబాద్,నవంబర్ 24: శాసనసభ స్పీకర్ పదవికి కిరణ్కుమార్రెడ్డి రాజీనామా చేయడంతో కొత్త స్పీకర్ ఎవరనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి లలో ఒకరిని స్పీకర్గా ఎంపిక చేసే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు సమాచారం. వీరిలో అసెంబ్లీ నియమ నిబంధనలు క్షుణ్నంగా తెలియడంతోపాటు రాజకీయాల్లో అపార అనుభవమున్న గాదె వెంకటరెడ్డి వైపే హైకమాండ్ మొగ్గుచూపుతున్నా, గాదె వెంకటరెడ్డి మాత్రం స్పీకర్ పదవిని నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నారు.దీనితో డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ను స్పీకర్ పదవి వరించే అవకాశాలున్నాయి.కాగా, జాతీయ విపత్తుల నివారణ కమిటీ సభ్యుడు మర్రి శశిధర్రెడ్డి, మాజిమంత్రి జె.గీతారెడ్డిల పేర్లు కూడా స్పీకర్ పదవికి వినవస్తున్నాయి. ఐతే సీఎంగా కిరణ్కుమార్రెడ్డి ఎంపికైనందున అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి స్పీకర్ పదవి ఇవ్వకూడదంటే మర్రి శశిధర్రెడ్డికి ఆ అవకాశం వుండక పోవచ్చు. గీతారెడ్డిఉప ముఖ్యమంత్రి పదవి వైపు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ పేరునెవ్ హైకమాండ్ ఖరారు చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి.
Comments