నాగపూర్ టెస్ట్ లో భారత్ ఘన విజయం
నాగపూర్,నవంబర్ 23: నాగపూర్ టెస్ట్ లో భారత్ ఘన విజయం సాధించింది. భారత్ బౌలర్ల ధాటికి కివీస్ 175 పరుగులకే చేతులెత్తేసింది. దాంతో న్యూజిలాండ్పై ఇన్నింగ్స్ 198 పరుగుల తేడాతో మూడు టెస్ట్ ల సిరీస్ను 1-0 తో టీమిండియా కైవసం చేసుకుంది. ఇషాంత్ శర్మ, హర్బజన్ చెరో మూడు వికెట్లు, ఓజా, రైనా చెరో రెండు వికెట్లు తీశారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా రాహుల్ ద్రావిడ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా హర్భజన్సింగ్ ఎంపిక అయ్యారు.

Comments