బ్రెజిల్‌ అధ్యక్షునికి ఇందిరా గాంధీ శాంతి బహుమతి

న్యూఢిల్లీ ,నవంబర్ 19: ప్రతిష్టాత్మకమైన ‘ఇందిరా గాంధీ శాంతి బహుమతి - 2010’ బ్రెజిల్‌ అధ్యక్షుడు లూయిస్‌ ఇయాన్సియో లులా డా సిల్వకు దక్కింది. నిరాయుధీకరణ, అభివృద్ధి రంగాల్లో విశేష కృషి చేసిన వారిని ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అధ్యక్షతన గల అంతర్జాతీయ కమిటీ ఈ ఎంపిక చేస్తుంది. బ్రెజిల్‌లో ఆకలి సమస్యను తొలగించడం, దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు చేసిన విశిష్టమైన కృషికి గాను లులాను ఎంపిక చేసినట్లు కమిటీ ప్రకటించింది. లులా త్వరలో బ్రెజిల్‌ దేశాధ్యక్షుడిగా పదవీ విరమణ చేయనున్నారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు