బ్రెజిల్ అధ్యక్షునికి ఇందిరా గాంధీ శాంతి బహుమతి
న్యూఢిల్లీ ,నవంబర్ 19: ప్రతిష్టాత్మకమైన ‘ఇందిరా గాంధీ శాంతి బహుమతి - 2010’ బ్రెజిల్ అధ్యక్షుడు లూయిస్ ఇయాన్సియో లులా డా సిల్వకు దక్కింది. నిరాయుధీకరణ, అభివృద్ధి రంగాల్లో విశేష కృషి చేసిన వారిని ప్రధాని మన్మోహన్ సింగ్ అధ్యక్షతన గల అంతర్జాతీయ కమిటీ ఈ ఎంపిక చేస్తుంది. బ్రెజిల్లో ఆకలి సమస్యను తొలగించడం, దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు చేసిన విశిష్టమైన కృషికి గాను లులాను ఎంపిక చేసినట్లు కమిటీ ప్రకటించింది. లులా త్వరలో బ్రెజిల్ దేశాధ్యక్షుడిగా పదవీ విరమణ చేయనున్నారు.
Comments