Friday, November 19, 2010

బ్రెజిల్‌ అధ్యక్షునికి ఇందిరా గాంధీ శాంతి బహుమతి

న్యూఢిల్లీ ,నవంబర్ 19: ప్రతిష్టాత్మకమైన ‘ఇందిరా గాంధీ శాంతి బహుమతి - 2010’ బ్రెజిల్‌ అధ్యక్షుడు లూయిస్‌ ఇయాన్సియో లులా డా సిల్వకు దక్కింది. నిరాయుధీకరణ, అభివృద్ధి రంగాల్లో విశేష కృషి చేసిన వారిని ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అధ్యక్షతన గల అంతర్జాతీయ కమిటీ ఈ ఎంపిక చేస్తుంది. బ్రెజిల్‌లో ఆకలి సమస్యను తొలగించడం, దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు చేసిన విశిష్టమైన కృషికి గాను లులాను ఎంపిక చేసినట్లు కమిటీ ప్రకటించింది. లులా త్వరలో బ్రెజిల్‌ దేశాధ్యక్షుడిగా పదవీ విరమణ చేయనున్నారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...