Tuesday, November 30, 2010

ఎన్నారై వ్యాపారవేత్త అత్వాల్‌కు అవార్డు

లండన్,నవంబర్ 30: బ్రిటన్‌లో ప్రముఖ ఎన్నారై వ్యాపారవేత్త జాన్ అత్వాల్ ఈ ఏడాది ఆసియన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యారు. వ్యాపార రంగంలో సాధించిన విజయాలకు గుర్తింపుగా ఆయనకు ఈ అవార్డు దక్కింది. క్రిస్‌మస్ అలంకరణ వస్తువుల వ్యాపారంలో ఆయన అగ్రపథంలో ఉన్నారు. ఆయన స్థాపించిన ప్రీమియర్ డెకరేషన్స్ లిమిటెడ్ లక్షలాది ఫౌండ్ల టర్నోవర్‌తో వెలుగొందుతోంది. డచెస్టర్ హోటల్‌లో సోమవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ సతీమణి చెరీ బ్లెయిర్ చేతులుగా మీదుగా జాన్ అత్వాల్ అవార్డు అందుకున్నారు. ఆసియన్ హూస్ హూ ఇంటర్నేషనల్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. పంజాబ్‌కు చెందిన అత్వాల్ తల్లిదండ్రులు 1961లో బ్రిటన్‌కు వలసవచ్చారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...