ఆర్ధిక గణాంకాలలో ఘనాపాటి...

హైదరాబాద్,నవంబర్ 24:  వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణంతో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రోశయ్య 14 నెలల 22 రోజుల పాటు రాష్ట్రాన్ని పాలించారు.  రాజకీయాల్లో అపార అనుభమున్న రోశయ్య రాష్ట్రంలో వివిధ పదవులను నిర్వహించారు. రాష్ట్ర శాసనసభలో ఆర్థిక మంత్రి హోదాలో అత్యధికసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత ఆయనకు దక్కింది. కొణిజేటి రోశయ్య 1933, జూలై 4న గుంటూరు జిల్లా వేమూరు గ్రామములో జన్మించారు.  గుంటూరు హిందూ కళాశాల లో కామర్స్ అభ్యసించారు.  ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున 1968, 1974, 1980లలో శాసనమండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. అనేక ముఖ్యమంత్రుల మంత్రివర్గాలలో పలు కీలకమైన శాఖలు నిర్వహించారు. 1979లో టంగుటూరి అంజయ్య ప్రభుత్వంలో రవాణ , గృహనిర్మాణం, వాణిజ్య పన్నుల శాఖలు, 1982లో కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రభుత్వంలో హోం శాఖ, 1989లో మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో ఆర్ధిక, రవాణ, విద్యుత్తు శాఖలు, 1991లో నేదురుమల్లి జనార్ధనరెడ్డి ప్రభుత్వంలో ఆర్ధిక, ఆరోగ్య, విద్య , విద్యుత్ శాఖలు, 1992లో కోట్ల విజయభాస్కర రెడ్డి ప్రభుత్వంలో ఆర్ధిక, ఆరోగ్య, విద్య , విద్యుత్ శాఖలకు మంత్రిగా పనిచేసారు. 2004 మరియు 2009లో వై.యస్. రాజశేఖరరెడ్డి ప్రభుత్వములో ఆర్ధిక మంత్రిగా భాద్యతలు నిర్వర్తించారు. ఆయన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ను  15 సార్లు ఆంద్రప్రదేశ్ శాసనసభలో ప్రవేశపెట్టారు. 1995-97 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపిసిసి) అధ్యక్షుడిగా పనిచేశారు. 1998లో నరసరావుపేట నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎన్నికయ్యారు.  2004-09 కాలంలో 12వ శాసనసభకు చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికైనా,, 2009 ఎన్నికల ముందు ప్రత్యక్ష ఎన్నికలలో పోటీచేయకుండా శాసనమండలి సభ్యుడిగా ఎన్నికైనారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందడంతో 2009, సెప్టెంబర్ 3న రోశయ్య ఆపద్దర్మ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసారు. సి.ఎం. గా పనిచేసిన కాలమంతా అనేక ఒతిళ్ళను, సమస్యలను ఎదుర్కొని చివరకు హుందాగా పదవినుంచి వైదొలగారు.  

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు