Saturday, November 20, 2010
బీహార్లో మళ్లీ బీజేపీ, జేడీయూ కూటమి దే అధికారం: ఎగ్జిట్ పోల్స్
పాట్నా,నవంబర్ 20: : బీహార్లో మళ్లీ బీజేపీ, జేడీయూ కూటమి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ తెల్పుతున్నాయి. నితీష్ కుమార్ మళ్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించే అవకాశముందని సీఎన్ఎన్ ఐబీఎన్ ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఆరు విడతల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత సీఎన్ఎన్ ఐబీఎన్ సర్వే ఫలితాలు వెల్లడించింది. బీజేపీ, జేడీయూ కూటమికి 185-201 సీట్లు, ఆర్జేడీ, ఎల్జేపీ 22-32 సీట్లు దక్కించుకునే అవకాశాలున్నట్టు అంచనా వేసింది. కాంగ్రెస్ 6-12, ఇతరులు 9-19 స్థానాలు గెల్చుకునే ఛాన్స్ ఉందని ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడయింది. బీహార్లో చివరి దశ అసెంబ్లీ ఎన్నికలు శనివారం చెదురుమదురు సంఘటనలు మినహా పూర్తయ్యాయి. చివరి విడత ఎన్నికల్లో 26 స్థానాలకు పోలింగ్ జరిగింది. దాదాపు 50 శాతం పోలింగ్ జరిగిఇంది. గయా జిల్లా ఇమామ్గంజ్ నియోజకవర్గ పరిధిలోని లండా గ్రామంలో మావోయిస్టులు మందుపాతర పేల్చడంతో ఇద్దరు భద్రతా సిబ్బంది మృతి చెందారు. 9 మంది గాయపడ్డారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment