‘సాక్షి’ చానెల్‌ కథనంపై నివేదిక కోరిన ఎ.ఐ.సి.సి.

న్యూఢిల్లీ,నవంబర్ 21:  యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ పై  ‘సాక్షి’ చానెల్‌లో వచ్చిన కథనంపై  నివేదిక పంపాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని ఎ.ఐ.సి.సి. ఆదేశించింది.  పీసీసీ నుంచి నివేదిక వచ్చాక ఈ అంశంపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కాంగ్రెస్ ప్రతినిధి షకీల్ అహ్మద్ చెప్పారు. కాగా, ‘సాక్షి టీవీ’లో వచ్చిన కథనంపై తానేమీ మాట్లాడదలచుకోలేదని కేంద్ర న్యాయ శాఖ మంత్రి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి వీరప్పమొయిలీ చెప్పారు.  ఆ కథనాన్ని తాను చూడలేదని, తనకు ఆ విషయమే తెలియదని ఆయన  అన్నారు. 

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు