Tuesday, November 30, 2010

2జీస్పెక్ట్రం సుడిగుండం లో పార్లమెంట్

న్యూఢిల్లీ,నవంబర్ 30: పార్లమెంటులో పదమూడు రోజులుగా జేపీసీపై కొనసాగుతున్న ప్రతిష్టంభనను తొలగించేందుకు చేసిన తాజా ప్రయత్నాలు కూడా బెడిసికొట్టాయి. ప్రభుత్వం, విపక్షాలు తమ పట్టువీడకపోవడంతో స్పీకర్ మీరాకుమార్ మంగళవారం నిర్వహించిన అఖిలపక్ష భేటీ విఫలమైంది. 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)తో విచారణ జరిపించాలని విపక్షాలు ముక్తకంఠంతో డిమాండ్ చేయగా, దీనికి ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేద ని ప్రభుత్వం తేల్చి  చెప్పింది. ఇలా ఇరుపక్షాలు తమ పట్టు వీడకపోవడంతో శీతాకాల సమావేశాలు సజావుగా నడిచే సూచనలు కనిపించడం లేదు. ఈ కుంభకోణంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తునకు జరిపిస్తామని ప్రభుత్వం చెప్పగా, జేపీసీతోనే విచారణ జరిపించాలని విపక్షాలు తేల్చిచెప్పాయి. దీంతో రెండున్నర గంటలపాటు జరిగిన అఖిలపక్ష భేటీ వృథాగా ముగిసింది. అయితే పార్లమెంటు సమావేశాలు నిరవధికంగా వాయిదాపడతాయనే వార్తలను ప్రభుత్వం ఖండించింది. ఈ సమావేశాలు ఈనెల 13 వరకు జరగనున్నాయి. మరోవైపు, జేపీసీ డిమాండ్‌తో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలనే ఉద్దేశంతో ఎన్డీఏ యేతర విపక్షాలు రాష్టప్రతిని కలిశాయి. సీపీఎం, సీపీఐ, ఫార్వర్డ్‌బ్లాక్, టీడీపీ, అన్నాడీఎంకే, జేడీఎస్, ఎండీఎంకే, బీజేడీ, ఆర్‌ఎల్డీలకు చెందిన సుమారు 80 మంది ఎంపీలు పార్లమెంటు నుంచి రాష్టప్రతి భవన్ వరకు పాదయాత్ర నిర్వహించి, రాష్టప్రతికి వినతి పత్రం అందజేశారు. 2జీపై జేపీసీ విచారణకు ఆదేశించేలా ప్రభుత్వానికి సూచించాలని కోరారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...