Saturday, November 20, 2010

2జీ 'అక్రమార్కులను' శిక్షిస్తాం: ప్రధాని

న్యూఢిల్లీ,నవంబర్ 20:   2జీ స్పెక్ట్రమ్ కేటాయింపుల్లో అక్రమాలకు పాల్పడినవారెవరైనా సరే వదలబోమని, తప్పకుండా శిక్షిస్తామని ప్రధాని మన్మోహన్ సింగ్ ఉద్ఘాటించారు. పార్లమెంటులో రగడకు దారితీస్తున్న ఈ కుంభకోణంపై ఆయన మొట్టమొదటిసారి స్పందించారు. ఏ విషయాన్ని చర్చించడానికైనా ప్రభుత్వానికి భయం లేదని, పార్లమెంటును సజావుగా సాగనివ్వాలని ప్రతిపక్షాలకు ఆయన విజ్ఞప్తి చేశారు. 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపుల్లో ఎవరి స్వప్రయోజనాలు దాగి ఉన్నాయన్న దానిపై దర్యాప్తు సంస్థలు ఆరా తీస్తున్నాయని చెప్పారు. ‘మీరెవరూ సందేహపడాల్సిన అవసరం లేదు. ఎవరు ఎలాంటి తప్పు చేసినా వారిని చట్ట ప్రకారం శిక్షిస్తాం’ అని అన్నారు. అయితే ప్రజాస్వామ్యంలో ఇవన్నీ క్రమబద్ధంగా జరగడానికి వీలుగా పార్లమెంటును సజావుగా సాగనివ్వాలని రాజకీయ పార్టీలను కోరారు. ‘పలు చట్టాలు చేయడానికి, అనుబంధ పద్దులు ఆమోదం పొందడానికి పార్లమెంటును సజావుగా నడపాల్సిన అవసరం ఉంది’ అని పేర్కొన్నారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...