Saturday, November 20, 2010

నాగపూర్ టెస్ట్; కివీస్ 148/7

నాగపూర్,నవంబర్ 20:  భారత్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ లో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి   న్యూజిలాండ్  తొలి ఇన్నింగ్స్ లో   7 వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది.  మెక్‌కల్లమ్ 34, సౌథీ 7 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. మెకింతోష్ 4, గుప్తిల్ 6, టేలర్ 20, వెటోరి 3, రైడర్ 59, హప్కిన్స్ 7 పరుగులు చేసి అవుటయ్యారు. విలియమ్‌సన్ పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ దారి పట్టాడు. భారత బౌలర్లలో శ్రీశాంత్, ఇషాంత్ శర్మ, ఓజా రెండేసి వికెట్లు తీశారు. హర్భజన్‌కు ఒక వికెట్ దక్కింది. వాతావరణం అనుకూలించకపోవడంతో మొదటి రోజు ఆట ఆలస్యంగా ప్రారంభమయింది.  

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...